Header Banner

ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

  Wed Mar 12, 2025 22:42        Politics

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో శుభవార్త వినిపించింది. టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపు కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, నెల్లూరు, గుంటూరులో ఈ మూడు టెక్స్‌టైల్ పార్కులు నిర్మించనున్నారు. ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్ స్కీమ్ (SITP) కింద రూ.310 కోట్లతో ఏపీలో మూడు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. లోక్‌సభలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

ఏపీ పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు రూ.134.41 కోట్లతో విశాఖపట్నంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రోత్సాహం అందించేందుకు గానూ.. కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే అనంతపురంలో రూ.102.27 కోట్లతో హిందూపురంలో వ్యాపార్ అప్పారెల్ పార్కు, నెల్లూరులో రూ.103.44 కోట్లతో తారకేశ్వర టెక్స్‌టైల్ పార్కు, రూ.105.12 కోట్లతో గుంటూరులో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్ స్కీమ్ కింద వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో బ్రాండిక్స్ ఇండియా అప్పారెల్ పార్కును ఇప్పటికే పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

 

ఇది కూడా చదవండి: వైసిపి మరో బిగ్ షాక్! కీలక నేతలు నోటీసులు… ఎన్ని కేసులు నమోదు ఆంటే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations